టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసీస్తో జరిగిన పోరులో భారత అభిమానులు కొందరు స్మిత్ను ఛీటర్ అంటూ గేలి చేయడంతో కోహ్లీ మైదానం నుంచే వారిపై అరిచాడు. అలా అనొద్దంటూ వారించి ప్రోత్సహించాలని సైగలతో సూచించాడు. మ్యాచ్ ముగిసాక మీడియా సమావేశంలోనూ విరాట్ దీనిపై స్పందించాడు. ఫ్యాన్స్ చేసిన తప్పుకు ఆసీస్ కెప్టెన్ను క్షమాపణలు కోరాడు. అభిమానులు ఇలా చేయడం తగదని , హుందాగా వ్యవహరించాలని సూచించాడు.