వారిపై లీగల్‌గా ముందుకెళ్తా : ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు

Update: 2019-06-12 13:11 GMT

అగ్రిగోల్డ్‌ విషయంలో అవకతవకలు జరిగినట్లు నిరూపించగలిగితే... ప్రజా జీవితం నుంచి వెళ్లిపోతానని సవాల్‌ చేశారు... ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు. 2015లో కమిటీ వేసి.. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేశామని ఆయన వెల్లడించారు. న్యాయపరమైన పనులే చేశాను తప్ప.. ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వివరణ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేసిన వారిపై లీగల్‌గా ముందుకెళ్తానని కుటుంబరావు స్పష్టం చేశారు.

Similar News