టీడీపీ నేతపై వైసీపీ వర్గీయుల దాడి

Update: 2019-06-14 05:47 GMT

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో రాజకీయ కక్షలు తీవ్రరూపం దాల్చాయి. పొన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైఎస్ చైర్మన్, టీడీపీ నేత బండ్లమూడి బాబూరావుపై వైసీపీ వర్గీయులు దాడిచేశారు. తీవ్రగాయాలపాలైన బాబూరావును గుంటూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందంటున్నారు బంధువులు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలను జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News