గుజరాత్లోని సోన్గఢ్లో వాయు తుఫాన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు స్థానిక రైల్వే స్టేషన్పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈదురు గాలులకు ఏకంగా రైల్వేస్టేషన్లోని బల్లలే ట్రాక్పైఎగరిపడ్డాయి. గాలుల ధాటికి పలు వస్తువులు దెబ్బతిన్నాయి. దీంతో రైల్వే సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జనం తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో స్టేషన్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తుఫాన్ కారణంగా ముందుగానే పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు.