దేశంలో కాంగ్రెస్ శకం ముగిసింది అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు.. దేశ చరిత్రలో ఒక పార్టీ ఇంతలా భారీ మెజారిటీ సాధించడం ఇదే మొదటి సారి అని గుర్తు చేశారు. దేశాన్ని బీజేపీ మాత్రమే నడిపిస్తుందనే నమ్మకంతో 2019 ఎన్నికల్లో ప్రజలు ఓటేశారని అభిప్రాయపడ్డారు. బీజేపీ 224 స్థానాల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిందన్నారు. లెఫ్ట్ ప్రాబల్యం ఉన్న త్రిపుర, పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ బలపడుతోంది అన్నారు మురళీధర్ రావు.