సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. చిలుకూరు మండలం మిట్స్ కాలేజీ సమీపంలోని గోదాముల దగ్గర ఓ ఆటోని ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. భయంతో లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.