బాసర అమ్మవారి ప్రసాదంలో పురుగులు

Update: 2019-06-22 11:24 GMT

బాసర అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావడం కలకలం రేపుతోంది. భక్తులు లడ్డూ ప్రసాదాన్ని తింటున్న సమయంలో అందులోంచి పురుగు వచ్చింది. దీంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా ప్రసాదం తయారీలో మళ్లీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు సిబ్బంది.

Similar News