ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం... తాజాగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపు జేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులందరికి ఈ పథకం ద్వారా ఏటా 15 వేలు అందజేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు. క్యాంపు ఆఫీసులో జరిగిన విద్యాశాఖ సమీక్షలో డెసిషన్ తీసుకున్నారు సీఎం జగన్.