ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటు అని పేర్కొన్నారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్బుక్లోకి ఎక్కారని గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి అంటూ తెలిపారు.కృష్ణ గారికి, నరేష్కి ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందారు.