జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రం కోసం కష్టపడిన చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అరోపించారు. ప్రతిపక్ష పార్టీని కుంగదీయాలని చూసినా, ప్రతిపక్ష నాయకుడ్ని అవమానించాలని ప్రయత్నించే దగ్గర ప్రజాస్వామ్యం ఖూని అయినట్లేనని అన్నారు. కరువుతో అల్లాడుతున్న రైతు సమస్యల కంటే జగన్ కు కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు అచ్చెన్నాయుడు.