మధ్యప్రదేశ్లో జోరుగా వానలు కురుస్తున్నారు. భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి.. ఖర్గన్ ప్రాంతంలో ఓ ద్విచక్ర వాహదారుడు రోడ్డు దాటుతుండగా వరద నీటిలో కొట్టుకుపోయాడు. అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని వరద నీటిలో నుంచి బయటకు తీసారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అటు మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.