సాధారణంగా బడ్జెట్ అనగానే.. బ్రీఫ్ కేస్ పట్టుకున్న ఆర్థిక మంత్రే గుర్తుకు వస్తారు. కానీ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ ట్రెండ్ ను మార్చారు. బ్రీఫ్ కేస్ స్థానంలో.. ఎరుపు రంగులో ఉన్న పార్శిల్ బ్యాగ్ తో కనిపించారామె. దానిపై మూడు సింహాల రాజముద్ర కూడా ఉంది. సంప్రదాయాన్ని పక్కనబెట్టి ఎర్రటి బ్యాగ్లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు నిర్మలా సీతారామన్. అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి బడ్జెట్ పత్రాల కాపీని అందజేశారు. లోక్సభలో సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.