ఎన్నారై ప్రభాకర్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి : వర్ల రామయ్య

Update: 2019-07-05 10:25 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు వర్ల రామయ్య. లోకేష్‌పై అసభ్యకర పోస్టింగులు పెట్టిన NRI ప్రభాకర్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండాలి అనే విధంగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడి చేస్తున్నారని వర్ల ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన నవరత్నాల అమలుపై దృష్టి పెట్టకుండా, గత నిర్మాణాలు కూల్చుతూ విధ్వంసంకు పాల్పడడం సరికాదన్నారు.

Similar News