సెమీస్ లో చోటు సంపాదించుకున్న భారత జట్టు ఆఖరి లీగ్ మ్యాచ్కు సిద్ధమైంది. శ్రీలంకతో తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్కు 15 పాయింట్లు దక్కుతాయి. ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న భారత జట్టు 15 పాయింట్లకు చేరితే అది లాభిస్తుంది. అటు ఆస్ట్రేలియా (14) తమ చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై ఓడితే కోహ్లి సేన టాప్కు చేరుతుంది. ఇదే జరిగితే సెమీస్లో మన జట్టుకు న్యూజిలాండ్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాగా షమీ, చాహల్ కు విశ్రాంతి ఇచ్చింది.