టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్పై విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. ఏపీని ఉద్ధరించడానికే బీజేపీలోకి వెళ్తున్నట్లు వారు బిల్డప్ ఇచ్చారని, కానీ బడ్జెట్ చూసిన తర్వాత వారు ఎందుకు చేరారో బాగా అర్ధమైందని ఎద్దేవా చేశారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికే బీజేపీలోకి వెళ్లారంటూ సుజనా బృందంపై ట్విట్టర్ లో ఫైరయ్యారు. తన మాజీ సహచరులపై విమర్శనాత్మకంగా కేశినేని నాని చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది.