సకాలంలో విత్తనాలు అందకపోవడానికి గత ప్రభుత్వమే కారణం : ఎంవీఎస్ నాగిరెడ్డి

Update: 2019-07-06 12:30 GMT

గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మిషన్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రులతో పాటు మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. సమీక్షలో రైతు సమస్యల పరిష్కారంపై చర్చించామని ఆయన చెప్పారు. సకాలంలో విత్తనాలు అందకపోవడానికి గత ప్రభుత్వ ప్రణాళికా లోపమే కారణమన్నారు. ప్రతి నెల వ్యవసాయ మిషన్ సమావేశాలు నిర్వహించి రైతు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Similar News