టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించాడు. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్లో 34 పరుగులు చేసి నాటౌట్ నిలిచిన కోహ్లీ...ప్రపంచకప్లో 5 ఇన్నింగ్స్లలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత క్రికెటర్గా నిలిచాడు. అంతకుముందు క్రికెట్ లెజెండ్ సచిన్ 44 ఇన్నింగ్స్లో 2 వేల 278 పరుగులు చేయగా... సౌరవ్ గంగూలీ 21 ఇన్నింగ్స్లో 1006 పరుగులు సాధించాడు. ఇక ప్రపంచకప్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో క్రికెటర్గా నిలిచాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.