ఆర్థిక ఇబ్బందులు తాళలేక విశాఖలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విషాదానికి కారణమైంది. విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన సింహాద్రి ఈశ్వరరావు కుటుంబం పురుగులు మందు తాగి సింహాచలం డిపో సమీపంలో ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి వీరిని కేజీహెచ్కు తరలించారు . ఆసుపత్రికి వచ్చేసరికే ఈశ్వరరరావు ఆయన కుమార్తె చాందిని మృతి చెందారు. భార్య చంద్రకళ ప్రాణాలతో బైటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..