శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మలేషియా నుంచి అక్రమంగా తరలిస్తుండగా 150 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ డీఆర్ఐ అధికారులు. విమానాశ్రయంలోని కార్గోలో ఈ గోల్డ్ను గుర్తించారు. ఆర్బీఐ అనుమతి లేని ఓ ఏజెన్సీ బంగారాన్ని తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై ఎయిర్పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు.