సూర్యాపేటలో అర్థరాత్రి దారుణం జరిగింది.. విధులు ముగించుకుని వెళ్తున్న ఓ కానిస్టేబుల్ను బుల్లెట్ బైక్తో ఢీకొట్టారు ముగ్గురు వ్యక్తులు. ఉద్దేశపూర్వంగానే ఇలా దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలు కావడంతో సుధాకర్ను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. పరిస్థితి విషమించడంతో ఆయన్ను నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతిచెందాడు. కానిస్టేబుల్ మరణాన్ని డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంది. దీని వెనుక మిస్టరీ ఛేదించేందుకు ప్రయత్నం