వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి చాలా బాధ కలిగించిందని.. అయితే అంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదన్నాడు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. టోర్నీ మొత్తం తమ జట్టు అద్భుతంగా ఆడిందని... కేవలం ఒక రోజు మాత్రం తమకు ప్రతికూల ఫలితం వచ్చిందన్నారు. ధోనీపై వస్తున్న విమర్శలను కోహ్లీ మరోసారి తోసిపుచ్చాడు. ధోనీ అద్భుతమైన ఆటగాడని.. నిన్నటి పరిస్థితుల్లో జడేడాకు అండగా ఉండడానికే ధోనీ నెమ్మదిగా ఆడాడని కెప్టెన్ సమర్థించాడు.