45 రోజుల వైసీపీ పాలనలో ఏపీ వెలవెలపోతుంటే.. తెలంగాణ ఆర్థికంగా వెలిగిపోతుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. యువనేస్తం పథకాన్ని రద్దు చేసి.. నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైసీపీ కార్యకర్తల కోసమే వాలంటీర్ వ్యవస్థను తీసుకోచ్చారని ఆరోపించారాయన. బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే.. నవరత్నాలు నవ సందేహాలుగా మిగిలిపోతున్నాయని విమర్శించారు నిమ్మల రామానాయుడు.