రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడు మాట తప్పారు : నారా లోకేష్
రైతు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడు మాట తప్పారన్నారు. రైతు కష్టాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సున్నా వడ్డీ పథకాన్నిటీడీపీ ప్రభుత్వం రద్దు చేసిందంటూ జగన్ అసత్య ఆరోపణలు చేశారన్నారు నారా లోకేష్. శాసనమండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా లోకేష్ మాట్లాడారు.