కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో వాడివేడి సంవాదాలు చోటు చేసుకున్నాయి. కాపులకు 5 శాతం కోటా కొనసాగించేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారా.. లేదా.. అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరక్కుండా.. రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించామని చెప్పారాయన. రెండుసార్లు మేనిఫెస్టోలో పెట్టి దగా చేసింది వైఎస్సార్ అంటూ చంద్రబాబు విమర్శించారు.