గురుపౌర్ణిమ సందర్భంగా నిజామాబాద్ సాయిబాబా ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఉదయం స్వామివారికి హారతి ఇస్తుండగా.. ఎటునుంచి వచ్చిందో... తాబేలు గర్బగుడిలోకి ప్రవేశించింది. దీంతో ఒక్కసారిగా భక్తులు ఆశ్చర్యపోయారు. అయితే దేవుడే స్వయంగా తాబేలు రూపంలో సాక్షాత్కరించాడని భక్తులు ప్రత్యేకపూజలు చేశారు.