ట్విట్టర్ వేదికగా మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని జగన్.. అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకున్నారని అన్నారు. ఇందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. బాబు హయంలో ఒక్క జాబు కూడా రాలేదు అంటూ ఎన్నో ఆసత్యాలు తన పాదయాత్రలో చెప్పారని అన్నారు. కానీ సీఎం అయిన తరువాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పాలనలో 39వేల 450 పరిశ్రమలు ఏర్పాటు చేసి..
5లక్షల 13 వేలమందికి పైగా ఉద్యోగాలు కల్పించారని చెప్పారని గుర్తు చేశారు. ఐటీలో వెయ్యి కోట్ల పెట్టుబడులలతో 175 కంపెనీల ద్వారా 30వేల 428 మందికి ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారని లోకేష్ అన్నారు. వీటిని చెప్పినట్లే ఎలక్ట్రానిక్ ఇతర రంగాల్లో టీడీపీ ప్రభుత్వం ఉద్యోగాలు , ఏర్పాటవుతున్న కంపెనీలు, రాబోయే ఉద్యోగాల వివరాలు కూడా బయటపెట్టాలన్నాని కోరారు లోకేష్.