పోలవరంపై నిపుణుల కమిటీ స్టడీ చేస్తోందన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. నాలుగు నెలలుగా పనులు ఆగిపోయాయని.. వాటి నవంబర్లో ప్రారంభిస్తామని శాసన సభ దృష్టికి తీసుకువచ్చారు. 2021నాటికి నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. తొలిసారిగా రివర్స్ టెండరింగ్కు వెళ్తున్నామని చెప్పారు జగన్.