కర్నాటక స్పీకర్, సీఎంలు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు. ప్రభుత్వం మైనారిటీలో ఉన్నా.. సీఎం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. విశ్వాసపరీక్ష జరుగుతున్న సమయంలో ప్రభుత్వ అధికారులను ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీలో అవిశ్వాసంపై కాకుండా.. ఇతర విషయాలపై చర్చ జరుగుతోందని విమర్శించారు. వెంటనే స్పీకర్ వివ్వాస పరీక్షపై చర్చించి ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చేపట్టాలని డిమాండ్ చేశారు.