కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం సభ్యుల విశ్వాసాన్ని కోల్పోయింది. డివిజన్ పద్ధతిలో జరిగిన ఈ ఓటింగుకు 204 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మ్యాజిక్ ఫిగర్ 103 గా ఉంది. అయితే కాంగ్రెస్ + జేడీఎస్ కు అనుకూలంగా 99 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా.. బీజేపీకి అనుకూలంగా 105 మంది మద్దతు పలికారు.ఇక అందరూ ఊహించినట్టే బీజేపీ బలం సాధించింది. బలపరీక్షలో విశ్వాసం కోల్పోయిన కుమారస్వామి ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.