కర్నాటకంలో మరో ట్విస్ట్. అసమ్మతి ఎమ్మెల్యేలకు స్పీకర్ రమేష్ కుమార్ గట్టి షాక్ ఇచ్చారు. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. రమేష్ జార్ఖిహోళీ, ఆర్. శంకర్, మహేష్ కుమటల్లిలను అనర్హులుగా ప్రకటించారు. ఇందులో ఆర్.శంకర్ను 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు.