యాదాద్రి భువనగిరి జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మోత్కూర్ మండలం బుజిలాపురం దగ్గర ట్రాన్స్ఫార్మర్ను బడి బస్సు ఢీ కొట్టింది. ఆ సమయంలో కరెంటు సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన సమయంలో స్కూల్ బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు.