గుంటూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది. చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఉన్న సంగం డైరీలో దొంగలుపడ్డారు. ఏకంగా 40 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. అర్ధరాత్రి దాటాక చోరీ జరిగింది. చైర్మన్ ధూళిపాళ్ల నరంద్రకుమార్ ఆఫీస్పై ఉండే గదిలో దొంగతనం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫూటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.