టిక్టాక్ .... విద్యార్ధుల ప్రాణాల మీదకు తెస్తోంది. తిరుపతిలో మురళీ అనే విద్యార్ధి... టిక్టాక్ మోజులో పడి ఏకంగా.. శేషాచలం అడవుల్లోకెళ్లిపోయి దారితప్పాడు. ఆ అడవిలో... చిమ్మచికట్లో ఉన్న మురళీ... రాత్రంతా భయంతో గడిపాడు. ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చివరికి వాట్సప్ ద్వారా తన స్నేహితులకు తానెక్కడున్నదీ లొకేషన్ ద్వారా షేర్ చేశాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో మురళిని రక్షించేందుకు అర్ధరాత్రి అడవి బాట పట్టారు పోలీసులు.
ఎట్టకేలకు తెల్లవారుజామున మురళిని గుర్తించిన పోలీసులు.. అతన్ని రక్షించారు. తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. కలకడ మండలానికి చెందిన మురళి... తిరుపతిలోని ప్రైవేట్ కళాశాలలో మైక్రోబయాలజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. చదువుని, సమయాన్ని తెలివితేటల్ని ఇలా టిక్ టాక్లు చేస్తూ యువత దుర్వినియోగపరుస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.