ఈశాన్య బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం గాంజటెక్వెస్ట్ బెంగాల్ వైపు తరలివెళ్లింది. దీంతో కోస్తాలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతోపాటు,భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది..