లోక్‌సభలో ఆమోదం పొందిన కశ్మీర్‌ విభజన బిల్లు

Update: 2019-08-06 13:56 GMT

రాజ్యసభలో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఉదయం 11 గంటలకు మొదలైన చర్చ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది.

ఈ బిల్లులకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గెజిట్ కూడా విడుదల చేశారు. రాజ్యసభలో బిల్లుకు అనూకూలంగా 125, వ్యతిరేకంగా 61 ఓట్లు రావడంతో బిల్లులకు సభామోదం లభించింది. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 351మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. దీంతో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినట్టయింది.

Similar News