వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక రేట్లు తగ్గాయా? పెరిగాయా? అని నిలదీశారు చంద్రబాబు. తమ ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా అందిస్తే.. వేల కోట్లు దోచుకున్నారంటూ విషప్రచారం చేశారని మండిపడ్డారు. మరి ఇప్పుడు వైసీపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇసుక పేరు చెప్పి వైసీపీ నాయకులు పది రెట్లు దోచేస్తున్నారని ఆరోపించారు.