ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతూ.... 70 ఏళ్లలో చేయలేని పనిని తాము 70 రోజుల్లో చేసి చూపించామన్నారు మోదీ. లద్ధాఖ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. కొత్త ఆలోచనలతో జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ ప్రజలు ముందుకు సాగాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ అధికారం అందాలన్నారు. ఆర్టికల్ 370 అవినీతికి, బంధుప్రీతికి తప్ప దేనికీ ఉపయోగపడలేదన్నారు మోదీ.