టీఆర్ఎస్కు కాంగ్రెస్ తోక పార్టీ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తాము కాదని.. టీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్న విషయం ప్రజలందరికి తెలుసన్నారు. కేంద్రంలో ఎప్పుడు అవసరమైనా టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న విషయాన్ని భట్టి గుర్తు చేశారు. రీడిజైన్ చేసిన ప్రాజెక్టులపైనా బీజేపీ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన లక్ష్మణ్... అవసరమైతే హోంమంత్రిని కలిసిన కోరతానన్నారు.