తిరుపతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చేయాలి : మాజీ ఎంపీ డిమాండ్

Update: 2019-08-21 12:31 GMT

తిరుపతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని చేయాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. రాజధానిని దొనకొండకు మార్చడం దాదాపు ఖాయమైందని చెప్పారాయన. కేంద్రంతో సీఎం జగన్ చర్చలు కూడా జరిపారని తెలిపారు. రాజధానికి దొనకొండ అనుకూలంగా ఉండదని.. తిరుపతి కరెక్టుగా ఉంటుందని అన్నారాయన.

Similar News