విషాదం : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Update: 2019-08-22 16:09 GMT

కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. ఏం కష్టమొచ్చిందో... కైకలూరు మండలం అయోధ్యపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వెలగల బల రామకృష్ణారెడ్డితో పాటు అతని భార్య సుబ్బలక్ష్మీ, కుమారుడు గంగాధర్‌రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆత్మహత్యకు కారణం ఏంటి? కుటుంబ కలహాల లేక ఆర్థిక సమస్యలా? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News