అరుణ్జైట్లీ మృతిపట్ల కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయానని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో జైట్లీనే తనకు మార్గదర్శి అని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ పర్యటనలోఉన్న అమిత్ షా జైట్లీ మరణ వార్త వినగానే హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరారు.