పిచ్చోడి చేతిలో రాయి.. ఏం చేస్తున్నాడో తెలియడంలేదు : అచ్చెన్నాయుడు

Update: 2019-08-25 15:58 GMT

మంత్రి బొత్స మాటలకు విలువ లేదని.. ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. అమరావతిని మార్చాలన్న, ఉంచాలన్నా, చంపేయాలన్నా అంతా జగన్‌ చేతిలోనే ఉందన్నారు. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి జగన్‌ ఏం చేస్తున్నాడో తెలియడం లేదన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలాగే వేధిస్తే.. రాష్ట్రంలో ఒక్క వైసీపీ కార్యకర్త అయినా మిగిలేవారా అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.

Similar News