ఏపీలో పరిపాలన అస్తవ్యస్థంగా మారిందన్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రోజుకో ప్రకటనతో అమరావతిపై తీవ్ర గందరగోళం నెలకొందని చెప్పారాయన. జగన్, కేసీఆర్ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము జగన్ కు లేదని ఆయన అన్నారు.