చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 120 మంది ప్రయాణికులతో ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో.. విమానంలో లోపాన్ని గుర్తించాడు పైలట్. ముంబై నుంచి టేకాఫ్ అయిన అరగంట తరువాత సమస్యను గుర్తించిన పైలట్... వెంటనే ముంబై ఎయిర్పోర్ట్ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతి ఇచ్చారు.