దేశ ఆర్థిక పరిస్థితిపై మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి 5 శాతానికి పడిపోవడంతో మందగమన ప్రభావం కనిపిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థికస్థితికి మోదీ ప్రభుత్వ పనితీరే కారణమన్నారు మన్మోహన్. ఉత్పాదక రంగం 0.6 శాతానికి పడిపోవడం విచారం కలిగిస్తోందన్నారు మన్మోహన్ సింగ్. వాహన రంగంలోనే మూడున్నర లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు.