దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ముంబైలో పర్యటిస్తున్న ఆయన సిద్ధి వినాయక టెంపుల్ను సందర్శించారు. విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమిత్ షాను ఆశీర్వదించి.. తీర్ధప్రసాదాలు అందజేశారు. స్వామి వారి దర్శన అనంతరం బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.