ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు రామ్ జఠ్మలానీ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా జఠ్మలానీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆదివారం ఉదయం దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కేంద్ర మంత్రిగా, బార్ కౌన్సిల్ ఛైర్మన్గా పనిచేసిన ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుప్రీంలో ఎన్నో వివాదాస్పద కేసులనూ రామ్ జఠ్మలానీ వాదించారు.