తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జనసేన ప్లెక్సీలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పవన్ కళ్యాణ్ దిండి పర్యటన సందర్బంగా జనసేన కార్యకర్తలు భారీఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షునికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం కలకలం రేపింది. దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీ వాళ్లు కావాలనే తమ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు.
Also watch