మాజీ మంత్రి పీతల సుజాత ఇంట విషాదం

Update: 2019-09-13 03:10 GMT

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పీతల సుజాత ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి, టీడీపీ సీనియర్ నేత.. రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు పీతల వరప్రసాద్‌(71) మృతిచెందారు. గురువారం విజయవాడలో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అప్పటికే మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి తీసుకువచ్చారు. స్థానిక టీడీపీ నేతలు వరప్రసాద్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. తీవ్ర విషాదంలో ఉన్న పీతల సుజాతను పలువురు నేతలు పరామర్శించి దైర్యం చెప్పారు.

Also watch :

Full View

Similar News