గుంటూరులో ఆకతాయిలు రెచ్చిపోయారు. నల్లచెరువు ప్రాంతంలో ద్విచక్రవాహనాలను దగ్ధం చేశారు. ఇంటిముందు పార్క్ చేసిన వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఏకంగా 17 వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న సీసీకెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దీనివెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని.. ఇది ఆకతాయిల పనే అని పోలీసులు భావిస్తున్నారు.
Also watch :